తిరుమలాయపాలెం. మే 28 : ఖమ్మం జిల్లా తిరుమలయపాలెంలో ఐకెపి గ్రామ దీపికల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ దీపికలు చెవిలో పువ్వు పెట్టుకుని ఒంటి కాలుపై నిల్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్రామ దీపికలకు సీఐటీయూ అలాగే పలు పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.