మణుగూరు టౌన్, మే 17: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమైనందున బీఎల్ఏ-2 (బూత్ లెవల్ ఏజెంట్) ఫామ్లు సోమ, మంగళవారాల్లో ఆర్డీవో కార్యాలయంతోపాటు మండల ఆఫీసుల్లోని ఎలక్షన్ డీటీలకు అప్పగించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
నిర్ణీత సమయంలోగా ఈ ఫారాలు అప్పజెప్పకపోతే తరువాత బీఆర్ఎస్ తరఫున ఓట్లను తొలగించినా కానీ, అడిగే అధికారం మనకు ఉండదని అన్నారు. త్వరితగతిన బీఎల్ఏ-2 ఫామ్లు ఆర్డీవో, ఎలక్షన్ డీటీలకు సమర్పించేలా పార్టీ మాజీ మండలాధ్యక్షులు చొరవ తీసుకోవాలని కోరారు.