ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే తమ తమ నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది యువకులతో కలిసి భారీ బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు.
అభ్యర్థులు వాహనాలపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రెట్టించిన ఉత్సాహంతో ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై జై కేసీఆర్’ అంటూ నాయకులు, కార్యకర్తలు, యువకులు నినాదాలు చేశారు. డీజే మోతలతోపాటు ఎటు చూసినా గులాబీ జెండాలే కనిపించడంతో మరింత జోష్ నింపింది.