ఖమ్మం: వైసీపీఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఖమ్మం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుల ఉపేందర్ అధ్యక్షత వహించారు. మాదిగలహక్కుల కోసం పోరాడింది అంబేద్కర్ కాదనిబాబు జగ్జీవన్ రాం మాత్రమేనని ఆంధ్ర ప్రదేశ్ వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం చేసిన పోరాటాలను, చరిత్రను చదువుకోవాలని ఎమ్మెల్యేకుహితవు పలికారు. భారత దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు అవుతుందని రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతున్న విషయం ఎమ్మెల్యేకు తెలియక పోవడం శోచనీయం అని, వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శ్రీదేవిని డిమాండ్ చేశారు.
ఈసందర్భంగా బి.ఆర్. అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవి కుమార్, మాల మహానాడు సీనియర్ నాయకులు గుంతేటి వీరభద్రం బీసీ నాయకులు లిక్కి కృష్ణారావు ,ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షులు బానోతు బద్రు నాయక్,బందెల నాగలక్ష్మి దాసరి శ్రీనివాస్ , ఎర్ర గంగాధర్, కాశీ, మల్ల భవాని, వుల్లంగి పద్మ,గుదిగొండ ఉప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.