ఖమ్మం సిటీ, ఆగస్టు 25: ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నానాటికీ బలోపేతం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దవాఖానకు అనుబంధంగా మెడికల్ కళాశాల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నూతన భవనాల నిర్మాణం, ఇతర వసతుల కల్పన నిమిత్తం ఇటీవల సర్కార్ నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలోనే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అదనంగా 28 మంది పీజీ పూర్తి చేసిన వైద్యులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ రెసిడెంట్ కౌన్సిలింగ్ పద్ధతిలో వైద్యులు విధులు నిర్వహించనున్నారు. పీజీ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఏదైనా ప్రభుత్వ దవాఖానలో విధిగా పనిచేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతే వారికి ఇండియన్ మెడికల్ బోర్డులో వారి పేర్లు రిజిస్టర్ అవుతాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు పనిచేసేందుకు ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించిన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఖమ్మం దవాఖానకు 28 మంది వైద్యులను పంపించారు. నిర్ణీత కాల పరిమితి పూర్తయిన తర్వాత ఇదే పద్ధ్దతిలో వారి పోస్టులను కొనసాగించే అవకాశం ఉందని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు తెలిపారు.
నియమితులైన వైద్యులు వీరే..
ఆసుపత్రికి అంజుమ్ యూనస్ హసన్ (ఆర్థో సర్జన్), అజ్మీరా సుభాశ్చంద్రబోస్ (ఆర్థో సర్జన్), బి.అనూష (ఆప్తమాలజీ సర్జన్), కె.సాహితీ (ఎండీ, రెస్పిరేటరీ మెడిసిన్), ఆర్.కీర్తివర్థిని (ఎండీ, డెర్మటాలజీ), లక్ష్మీకీర్తన (ఎండీ సైకియాట్రిక్) తాటవర్తి (ఎండీ సైకియాట్రిక్), వి.పావని (ఎండీ, రేడియో డయాగ్నసిస్), వి.నర్సింహతేజ (ఎండీ, పిల్లల వైద్య నిఫుణుడు), ఎం.మేఘన (ఎండీ పిల్లల వైద్య నిఫుణురాలు), టి.మౌనిక (ఎండీ, జనరల్ మెడిసిన్), కొర్లకుంట లక్ష్మి (ఎండీ, జనరల్ మెడిసిన్), భార్గవి (ఎండీ, జనరల్ మెడిసిన్), కె.వీణ (ఎండీ, జనరల్ మెడిసిన్), కె.సాయికార్తీక్ (ఎండీ, జనరల్ మెడిసిన్), కె.వినోద్ (ఎంఎస్ ఈఎన్టీ), దుంపటి విజయదుర్గ (ఎంఎస్ జనరల్ సర్జరీ), సీహెచ్ కార్తీక్ (ఎంఎస్, జనరల్ సర్జరీ), ఎస్.రవిశంకర్రాజ్ (ఎంఎస్, జనరల్ సర్జరీ), పి.చంద్రలేఖ (ఎండీ, మైక్రో బయాలజీ), జి.దీక్షిత (ఎండీ, పాథాలజీ), ఎం.శుభశ్రీ (ఎండీ, పాథాలజీ), ఎన్.నైనీషా (ఎండీ, గైనకాలజీ), పి.దివ్య (ఎండీ, గైనకాలజీ), టి.శ్రుతి(ఎండీ, గైనకాలజీ), టి.మానస (ఎండీ, ఎనస్తీషియా), పి.విమలాదేవి (ఎండీ, ఎనస్తీషియా), కె.సుష్మ (ఎండీ ఎనస్తీషియా) నియమితులయ్యారు.