పచ్చని పొలాల మధ్య చెరువు.. నెత్తిని మండించే ఎర్రటి ఎండ.. అయినా సమీప గ్రామాలకు చెందిన ప్రజలు లెక్కచేయడం లేదు. వలలు, తెరలు, గుమ్ములతో చెరువులోకి దిగారు.
జల పుష్పాలు పట్టుకునేందుకు పోటీపడ్డారు. చేతికి అందిన చేపలను బుట్టల్లో వేసుకుని ఆనందోత్సాహాలతో ఇండ్లకు తిరిగి వెళ్లారు. ఈ చిత్రాన్ని ఆదివారం కరకగూడెం మండలం తాటిగూడెం చెరువు వద్ద ‘నమస్తే’ బంధించింది.
– కరకగూడెం, మార్చి17