ఏన్కూరు: ఏన్కూరు పోలీస్స్టేషన్లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎలగందుల శ్రీకాంత్, ట్రైనీఎస్సై లక్ష్మీభార్గవి, ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్కానిస్టేబుల్ కోటేశ్వరరావు, సిబ్బంది వెంకట్, దాస్, సైదా, తదితరులు పాల్గొన్నారు.