ఖమ్మం :విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించడానికి అత్యాధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సూచించారు. పోలీస్ శాఖ పర్యవేక్షణలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్లో పునరుద్ధరించిన కంప్యూటర్ ల్యాబ్ను పోలీస్ కమిషనర్ సతీమణి, స్కూల్ చైర్ పర్సన్ హిృదయ్ మెనాన్ పోలీస్ కమిషనర్తో కలసి ప్రారంభించారు.
ఇటీవల ప్రారంభించిన ప్రభుత్వ విద్యా సంస్థలలో డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా శ్రీ కృష్ణ ప్రసాద్ హై స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కోసం నాలుగు లక్షల ఎనబై వేల రూపాయల విలువ చేసే10 కంప్యూటర్లు విరాళంగా అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎఆర్ కుమారస్వామి, ఏసీపీ విజయబాబు, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, సాంబశివరావు ,తిరుపతి, ప్రిన్సిపల్ శేషగిరిరావు పాల్గొన్నారు.