ఖమ్మం, అక్టోబర్ 18: ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు, తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఈసారి కూడా తనకు అధిక మెజార్టీ అందిస్తే ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఖమ్మం 12వ డివిజన్లో ధూళిపాళ్ల నాగేశ్వరరావు అధ్వర్యంలో బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం వేగంగా విస్తరిస్తున్న నగరమని, అత్యధిక సంఖ్యలో ప్రజలు ఇకడ ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు ఇకడ గజం స్థలం విలువ రూ.10 వేల లోపు ఉండేదని, అదే ఇప్పుడు రూ.30 వేలకు పైగా పలుకుతోందని, దీంతో ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగిందని అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అత్యధికంగా ఖర్చు చేయడం ద్వారానే ఇది సాధ్యమైందని అన్నారు. గతంలో నగర ప్రజలకు తాగునీళ్లు అందించేందుకు 25 వేల నల్లా కనెక్షన్లు ఉంటే.. వాటిని ఇప్పుడు 75 వేలకు పెంచామని, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. గతంలో ఉన్న ఏడు ఓవర్ హెడ్ ట్యాంకులను ఇప్పుడు 27కు పెంచినట్లు చెప్పారు. కేవలం నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకే రూ.300 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. నగర నడిబొడ్డున మురుగునీటి నిల్వ కేంద్రంగా ఉన్న లకారాన్ని శుభ్రం చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా తీర్చిదిద్దినట్లు వివరించారు.
ఖమ్మంలో విద్యా, వైద్య రంగాలను కూడా బలోపేతం చేశామని అన్నారు. ఏం చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందోననే కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఖమ్మానికి అవసరమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాను పోలీస్ కమిషనరేట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఅర్ దగ్గర పట్టుబట్టి కమిషనరేట్గా చేసుకున్నామని గుర్తు చేశారు. అనేక సదుపాయాల కల్పన అనంతరం నేడు ఖమ్మం గ్రోత్ సెంటర్గా నిలిచిందని, హైదరాబాద్ తరువాత ఖమ్మమే ఆ స్థాయిలో అభివృద్ధి చెందిందని వివరించారు. విజ్ఞులైన ఖమ్మం ప్రజలంతా ఈ ఎన్నికల్లోనూ మళ్లీ బీఆర్ఎస్ వైపే నిలవాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, ప్రముఖులు కొండబాల కోటేశ్వరరావు, చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, సీతారాములు, పోటు సుబ్బారావు, వజినేపల్లి శ్రీనివాస్, జట్ల కృష్ణయ్య, తాతా ప్రసాద్, వల్లభనేని రామారావు, శ్రీకాంత్, సరిపుడి గోపి పాల్గొన్నారు. అనంతరం 28వ డివిజన్ ప్రకాశ్నగర్లో దుర్గామాత విగ్రహం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు. బచ్చు విజయ్కుమార్, గజ్జెల లక్ష్మీ వెంకన్న, నాగండ్ల కోటి, పల్లి ఉపేందర్ పాల్గొన్నారు.