ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం విడుదల చేసిన టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు టాప్ ఫలితాలు సాధించారు. గతంలో కంటే ఎక్కువ మంది మంచి మార్కులు సాధించారు. విద్యార్థులను పాఠశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అధినేతలు అభినందించారు.
నగరంలోని హర్వెస్ట్ పాఠశాల విద్యార్థులు సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో నూరుశాతం ఫలితాలు సాధించారని కరస్పాండెంట్ రవిమారుత్ తెలిపారు. పాఠశాలలకు చెందిన పి.ప్రణవ్ 500 మార్కులకు 494, జస్రాజ్ హరికృష్ణ 494, సిద్ధార్థ్ 492, వెంకటసాయి వంశీ 491, నిహారిక, నిషిత 489, రోహిత్ 488, భార్గవి 487, జస్వంత్సాయి, యశ్వంత్ 486 మార్కులు సాధించారన్నారు. 470 మార్కులకు పైగా 37 మంది, 450 మార్కులకు పైగా 87 మంది సాధించారన్నారు. విద్యార్థులకు గుణాత్మక పద్ధతిలో పాఠాలు బోధిస్తుండడంతోనే మంచి ఫలితాలు వచ్చాయని ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి తెలిపారు.
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో రెజొనెన్స్ ఆధ్వర్యంలో శ్రీనివాసనగర్లో నిర్వహించిన పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని డైరెక్టర్లు ఆర్వీ నాగేంద్రకుమార్, కొలిపార నీలిమ తెలిపారు. పాఠశాలకు చెందిన వెన్నెల, నవీన్ 472 మార్కులు సాధించి ప్రథమ స్ధానంలో నిలిచారన్నారు. జీవన్రాజ్ 467, సాయి మనోజ్ఞ 441, హర్షిత్ 438, సుమంత్ 433, జశ్వంత్ 428, హారిక 425, గణేశ్ 420, జనని 419 మార్కులు సాధించినట్లు వివరించారు. 11 మంది విద్యార్థులు 400కిపైగా మార్కులు సాధించినట్లు చెప్పారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12: సీబీఎస్ఈ శుక్రవారం ప్రకంటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో హార్వెస్ట్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని కరస్పాండెంట్ రవిమారుత్ తెలిపారు. విద్యార్థిని పి.మానస 500 మార్కులకు 483 మార్కులు, అక్షర సంక్రాంతి 475, తనుష్క పఠానీ 465, ఉదారపు మోహన్సాయి 464, గాయత్రీకృష్ణ 464, త్రినాథ్ 463, షన్ముఖ నిరూప్ 462 మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి అభినందించారు.
బ్లూమింగ్ మైండ్స్ స్కూల్ విద్యార్థులు సీబీఎస్ టెన్త్ ఫలితాల్లో విజయభేరి మోగించారని పాఠశాల కరస్పాండెంట్ పి.అశోక్రెడ్డి తెలిపారు. నూరుశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎస్కే యాస్మిన్ 490 మార్కులు, టోనీశ్ 486, సరయు 484, హర్షవర్థన్ 483, యశ్వంత్ 483 మార్కులతో టాప్లో నిలిచారన్నారు. 90శాతానికి పైగా మార్కులు ఐదుగురు, 80శాతానికి పైగా 20 మంది, 70శాతానికి పైగా 28 మంది మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను పాఠశాల చైర్మన్ బి.సత్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ అభినందించారు.
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో నగరంలోని శ్రీచైతన్య ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. యశస్విని 487, షర్మిత 483, నిహాల్ 475, శ్రీజ 474, శౌర్యణ్రాయ్ 472, జాహ్నవి 470 మార్కులు సాధించారన్నారు. 450 మార్కులకు పైగా 22 మంది, 95 మంది ఏ-1 గ్రేడులు సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్స్ నాగప్రవీణ, శర్మ, ఉపాధ్యాయులు అభినందించారు.
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో నగరంలోని శ్రీవిద్యానికేతన్ విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించారన్నారని కరస్పాండెంట్ గొల్లపూడి రాంప్రసాద్ తెలిపారు. ఎన్.ప్రవీణ్ 425 మార్కులు, ఆదిత్య 420, విఘ్నేష్ 419 మార్కులు సాధించారన్నారు. నిరంతర పర్యవేక్షణ, పటిష్ఠ ప్రణాళికలు, ఉపాధ్యాయుల కృషితోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు, కరస్పాండెంట్ అభినందించారు.
వైరా టౌన్, మే12: సీబీఎస్ఈ ఫలితాల్లో న్యూఇరా విద్యాసంస్థల న్యూ లిటిల్ ఫ్లవర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాల నుంచి 94మంది పరీక్షలు రాయగా ఊరుకొండ కుశాల్ 489 (98%), ఎం.నాగ యశ్వంత్ 488 (97.6%), డి.నిఖిల్ 479 (96%), ఆర్.షన్ముఖప్రియ 478 మార్కులు సాధించారు. విద్యార్థులను పాఠశాల చైర్మన్ ఐవీ రమణరావు, డైరెక్టర్స్ పి.భూమేశ్వరరావు, కాపా మురళీకృష్ణ, కుర్రా సుమన్, లగడపాటి ప్రభాకర్రావు, ప్రిన్సిపాల్ షాజీ మ్యాథ్యూ, ఉపాధ్యాయులు అభినందించారు.