ఖమ్మం రూరల్, జూన్ 30 : పాలేరు ప్రజలంతా పాడిపంటలు, సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని సీతారామచంద్రస్వామిని వేడుకున్నట్లు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన భార్య కందాల విజయమ్మతో కలిసి ఆలయ కమిటీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఏదులాపురం గ్రామంలోని శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయం నాల్గొవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కందాల దంపతులకు ఘన స్వాగతం పలికారు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ తో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని, ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. పడమటి తండా, గుర్రాలపాడు, తల్లంపాడు, పొన్నెకల్లు తదితర గ్రామాలలో పర్యటించారు. ఇటీవల వివిధ కారణాలతో మరణించిన పలువురు వ్యక్తుల కుటుంబాలను కలిసి మరణించిన వ్యక్తుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుల కుటుంబాల సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు పార్టీ, తాను అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల, మున్సిపాలిటీ పరిధిలో ఆయ వార్డులకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పాలేరు ప్రజలు సుభిక్షంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి