పెనుబల్లి: జాతీయ అండర్ ఆర్మ్ క్రికెట్ పోటీలకు పెనుబల్లి మండలానికి చెందినక్రీడాకారుడు ఎంపికయ్యాడు. మండల పరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వంత్ ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయిపోటీలకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లాలో నలుగురు ఎంపిక కాగా, నలుగురిలో ఒకరు పెనుబల్లి మండల యువకుడు ఎంపిక కావడం విశేషం. ఈ నెల 30న సూరత్లో జరుగనున్న పోటీల్లో యశ్వంత్ పాల్గొననున్నాడు. జాతీయస్థాయి ఆర్మ్ క్రికెట్కు యశ్వంత్ ఎంపిక కావడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు.