చింతకాని, మే 16: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నామని తహసీల్దార్ మాలోత్ మంగీలాల్, ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ప్రొద్దుటూరు, నాగిలిగొండ గ్రామాల్లో క్రీడా స్థలాల ఎంపికకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. పల్లెప్రగతిలో గ్రామానికో నర్సరీ, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీలు, మంచినీటి ట్యాంకర్లు, గ్రామాల్లో పూర్తి చేసుకున్నామని, తదుపరి ప్రాధాన్యతా అంశంగా క్రీడా ప్రాంగణాల స్థలాలను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో గిర్ధావర్ పగడాల ఉష, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఏపీవో కోటయ్య, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.