కూసుమంచి/ ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 23: ఆడబిడ్డలకు టీఆర్ఎస్ సర్కారు పంపిన కానుక బతుకమ్మ చీరె అని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరెలను కూసుమంచి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తోందని, బతుకమ్మ చీరెలను మహిళలందరికీ అందిస్తోందని అన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి శేఖర్, బాణోత్ శ్రీనివాస్, ఇంటూరి బేబి, మీనన్, వేముల వీరయ్య, చాట్ల పరశురాం, మల్లీడి వెంకటేశ్వరరావు, మోదుగు వీరబద్రం, అద్దంకి ఉపేంద్రాచారి, అలీ, కొక్కిరేణి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం..
టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. ఆయా గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు, పింఛన్ మంజూరు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ సర్కారు కానుకగా చీరె సారెను పంపడం గొప్ప విషయమని అన్నారు. కాగా, ఆయా గ్రామాల పొలిమేరల్లో ఎమ్మెల్యే కందాళకు ఆయా గ్రామాల మహిళలు, గ్రామస్తులు పూలతో స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు బెల్లం ఉమా, యండపల్లి వరప్రసాద్, బెల్లం వేణుగోపాల్, గూడ సంజీవరెడ్డి, ఏ.వెంకన్న, ముత్యం కృష్ణారావు, జర్పుల లక్ష్మణ్నాయక్, సుమా, అశోక్కుమార్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.