కూసుమంచి, డిసెంబర్ 1: పాలేరు నియోజవర్గంలో తుది ఓటర్ల జాబితా ప్రకారం యువ ఓటర్లు 27.50 శాతం ఉన్నారు. 39 వేల మందికిపైగా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో అధికంగా యూత్ ఓటర్లు ఉన్నాయి. గురువారం జరిగిన పోలింగ్లో అధికంగా యువతే పాల్గొన్నారు. జిల్లాలోనే అత్యధికంగా 65వేల మంది యువ ఓటర్లు గల పాలేరు నియోజకవర్గంగా ఉంది. మొత్తం ఓటర్లలో 65వేల మంది యువ ఓటర్లు ఉన్నారు. పాలేరులో 27.50 శాతం మంది యూత్ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. నాలుగు మండలాల్లో యువ ఓటర్లు పోలింగ్ సమయంలో ఎక్కుంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో నియోజవకర్గ ఫలితాలపై యువ ఓటర్ల ముద్ర పడనుంది.
కూసుమంచి, డిసెంబర్ 1: గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా పాలేరు నియోజవకర్గం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని మరోసారి కార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో పాలేరులోనే అత్యధికంగా 92.05 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి కూడా 90.91 శాతం పోలింగ్ నమోదై అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గంగా ప్రథమంగా నిలిచింది.
2018 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,08,659 మంది ఉండగా వారిలో 1,92,164 మంది ఓటు హక్కు వినియోగించుకోని 92.05 శాతం పోలింగ్ నమోదైంది. 2023 ఎన్నికల్లో 2,36,287 మంది ఓటర్లకు గాను 2,14,810 మంది ఓటు హక్కు వినియోగించుకొని 90.91 శాతం పొలింగ్ నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల కంటే 1.14 శాతం పోలింగ్ తగ్గింది. అయినప్పటికీ మ్మడి జిల్లాలో పాలేరు పోలింగ్ పర్సటేజ్లో ప్రథమంగానే నిలిచింది.
కూసుమంచిలో 40,38 మంది ఓటర్లకు గాను 34,32 మంది ఓటర్లుటు హక్కు వినయోగించుకొని 84శాతం పోలింగ్ నయోదు అయింది. నేలకొండపల్లి టౌన్లో 6,788మంది ఓటర్లకుగాను 5,970 మంది ఓటు హక్కు వినయోగించుకొని 87.94 శాతం పోలింగ్ నమోదైంది. తిరుమలాయపాలెం పిండిప్రోలులో 3,085 మంది ఓటర్లకుగాను 2,808 మంది ఓటు హక్కు వినియోగించుకొని 91 శాతం పోలింగ్ నమోదైంది.రాజేశ్వరపురంలో 2,489 మంది ఓటర్లకు గాను 2,302 మంది ఓటు హక్కు వినియోగించుకొని 92.48 శాతం పోలింగ్ నమోదైంది. చెరువుమాధారంలో 4,001 ఓటుకు గాను 3,705 ఓటుల పోల్ అయ్యి 92 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఎంవీ పాలెంలో 3,687 ఓట్లు ఉండగా అందులో 3,252 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని 88 శాతం పోలింగ్ నమోదైంది. పెద్దతండాలో 4,936 ఓట్లకు గాను 3,579 మంది ఓటు హక్కు వినియోగించుకొని 72శాతం పోలింగ్ నమోదైంది. నేలకొండపల్లి మండలం చెరువు మాధారంలో 4,001 ఓటుకు గాను 3,705 ఓట్లు పోల్ అయ్యా 92 శాతం పోలింగ్ నమోదైంది.
మధిర, డిసెంబర్1: గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలోని 268 పోలింగ్ కేంద్రాల్లో 2,21,326 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,94,386 మంది ఓటర్లు వారి ఓటుహక్కును వినియోగించుకున్నారని మధిర అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి జీ గణేశ్ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1,07,111 మంది పురుషులు ఉండగా వీరిలో 95,406 మంది, 1,14,206 మంది మహిళలు ఉండగా వీరిలో 98,976 మంది, ఇతరులు 9 మందికి గాను నలుగురు ఓటుహక్కును వినియోగించుకోగా నియోజకవర్గ వ్యాప్తంగా 87.83 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. ముదిగొండ మండలంలో 48,158 మంది ఓటర్లకు గాను 42,620 మంది ఓటర్లు ఓటును వినియోగించుకొని 88.50 శాతం, చింతకాని మండలంలో 41,057 ఓటర్లు ఉండగా 37,440 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకొని 91.10 శాతం, బోనకల్లు మండలంలో 35,835 ఓటర్లకు గాను 31,968 పోలై 89.21 శాతం, మధిర 56,669 ఓటర్లకు గాను 47,506 మంది ఓటుహక్కును వినియోగించుకొని 83.83 శాతం, ఎర్రుపాలెం మండలంలో 39,608 మంది ఓటర్లకు గాను 34,888 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకొని 88.08 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నియోజకవర్గంలో అక్కడకక్కడ పోలింగ్ ఆలస్యం కావ డం వల్ల ఓటర్లు ఓటుహక్కుకు వినియోగించుకున్నారు.
ఎర్రుపాలెం, డిసెంబర్1: గురువారం జరిగిన పోలింగ్లో 88.08 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో మొత్తం 39,608 ఓటర్లు ఉండగా వీరిలో 19,411 పురుషులకు గాను 17,402 మంది, 20,196 మహిళలకు గాను 17,486 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 39,608 మంది ఓటర్లకు గాను 34,888 మంది తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు.
చింతకాని, డిసెంబర్ 1: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో 91.10శాతంగా ఓటు నమోదైంది. మండలంలోని 26 గ్రామాల్లో ఏర్పాటు చేసిన 49 పోలింగ్ బూత్లో ఓటర్లు అధిక సంఖ్యలో ఓట్లు వేశారు. కొన్ని గ్రామాల్లోని పోలింగ్ బూత్లలో రాత్రి 8గంటల వరకు ఓటర్లు బారులు ఉండి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.