ఖమ్మం, అక్టోబర్ 21 : ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. తన ఏకైక లక్ష్యం ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. ఖమ్మం 58వ డివిజన్ రాపర్తినగర్లో వేముల రవికుమార్ అధ్వర్యంలో శనివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. తాను స్థానికుడినని, ఖమ్మం భూమి పుత్రుడినని అన్నారు. కానీ ఇకడికి వచ్చే వారికి ఖమ్మం ఒక ఆప్షన్ మాత్రమేనని అన్నారు. వేరే చోట సీట్లు రాకపోయినా, అవకాశాలు లేకపోయినా వారు ఖమ్మం వైపు చూస్తారని విమర్శించారు. తాను ఎప్పుడూ అలా చేయలేదని, తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు ఖమ్మంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసినా, మరికొన్ని సార్లు ఓడిపోయినా ఇకడే ఉన్నారని, పక్క దిక్కులు చూడలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా తనకు అవకాశం వచ్చిందని, ఆ తరువాత అనతి కాలంలోనే ఖమ్మాన్ని తీర్చిదిద్దానని, అభివృద్ధిలో మేటిగా నిలిపానని వివరించారు. ఇప్పటికే ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ఉన్నారని, ఇక ముందు కూడా ఇలానే ఉండి అండగా నిలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.
ఖమ్మంలో తనకు అత్యధిక మెజారిటీ అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మీరు మంత్రులుగా ఉన్నారు ఏం తీసుకొచ్చారు.. ఏం అభివృద్ధి చేశారో చూపాలని డిమండ్ చేశారు. ఖమ్మం నగరానికి ఐటీ హబ్ తీసుకొచ్చానని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మంది జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానన్నారు. మున్నేరు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుతున్నదని, కొత్త బ్రిడ్జి మంజూరు చేయాలని, బ్రిడ్జికి ఇరువైపులా కరకట్ట నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అకడ ప్రజల వినతి మేరకు నేడు రూ.180 కోట్ల తో కొత్త కేబుల్ బ్రిడ్జి నిర్మాణం తీసుకొచ్చినానని, రానున్న రోజుల్లో కాల్వొడ్డు ప్రాంతం హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని తలపిస్తుందని, ఇది మీరు ఉన్నప్పుడు ఎందుకు రాలేదన్నారు. మాటలు చెప్పడం కాదు. పని చేసినప్పుడే ప్రజలు గుర్తిస్తారన్నారు. ఇప్పటికే ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉన్నారని, ఇక ముందు కూడా ఇలానే ఉండి అండగా నిలిచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి విజయం అందించాలన్నారు. సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ విజయ్కుమార్, పగడాల నాగరాజు, బత్తుల మురళీ, పారా నాగేశ్వర రావు, ప్రసాద్, రాయల పద్మజ, కందుల రాగిణి, సత్యనారాయణ రెడ్డి, మల్లికార్జున, వేముల పూర్ణ, వేముల పవన్ కళ్యాణ్, వేముల నవీన్ ఉన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 21 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఖమ్మం కమ్మ మహాజన సంఘం జిల్లా సెక్రటరీ తాళ్లూరి జీవన కుమార్ శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన జీవన్కు మంత్రి పువ్వాడ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రితో పాటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నాయకులు బత్తుల మురళీ, గొల్లపూడి హరికృష్ణ, పగడాల నాగరాజు జీవన్ కుమార్ కు అభినందనలు తెలిపారు.
ఖమ్మం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు సింగు శ్రీనివాస్తోపాటు 100 కుటుంబాలు శనివారం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బుర్రా వెంకటేశ్వర్లు, యాకూబ్ మియా, గొనెల వెంకన్న, కే. శ్రీను, అంజయ్య, గోనెల శ్యాం, అంబటి మట్టయ్య, సురేశ్తో పాటు 100 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు చేసిన సంక్షేమం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు కన్నం ప్రసన్న కృష్ణ, కుడుములు సత్యనారాయణ, మెడ మచ్చగిరి, జాలా రామయ్య ఉన్నారు. 31వ డివిజన్ ప్రదాన కార్యదర్శి వెల్లంపల్లి వెంకట సుబ్బారావు తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు. మంత్రి అజయ్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గాల సమన్వయకర్త ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు డోకుపర్తి సుబ్బారావు, ఎపురి రాధిక, గజ్జెల కృష్ణ, శోభా, ప్రణతి, సిరి ఉన్నారు.