ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 23 : రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 5 కేంద్రాల్లో పదో తరగతి విద్యార్థులు 955 మంది, 5 కేంద్రాల్లో ఇంటర్ విద్యార్థులు 1,108 మంది పరీక్ష రాయనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ, రెండు జిల్లాల కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు.
ఖమ్మం నగరంలోని మాంట్ఫోర్ట్ హైస్కూల్, ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.