ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 18 : తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు ఖమ్మం నగరంలో 8 కేంద్రాలను ఎంపిక చేశారు. టెన్త్కి 1,594మంది, ఇంటర్కు 1,755 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.
గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మాంట్ఫోర్ట్ హైస్కూల్, ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోమినాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ హైస్కూల్ ఉన్నాయి.
రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రోటరీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాండురంగాపురం జడ్పీ హైస్కూల్, ఖాజీపుర ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జలగంనగర్ జడ్పీ హైస్కూల్ ఉన్నాయి.
పరీక్ష కేంద్రాల్లోకి ఎవ్వరికి ఫోన్ అనుమతి లేదని, పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో చైతన్యజైని స్పష్టం చేశారు. పరీక్ష ప్రారంభమైన 5నిమిషాల తర్వాత అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కోఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు 9440728543, కంట్రోల్ రూమ్ నెంబర్ 8008403522లో సంప్రదించాలని సూచించారు.