ఖమ్మం : అన్నం సేవా ఫౌండేషన్ చేస్తున్నసేవా కార్యక్రమాలకు తనవంతుగా ఆర్ధిక సాయం అందించేందుకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ విరాళానికి సంబంధించిన చెక్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ . గౌతమ్ చేతులు మీదుగా నిర్వాహకులకు అందించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావుకు రూ.75 వేల చెక్కును అందించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోణాల రామకృష్ణ, కార్యదర్శి బండి నాగేశ్వరరావు, కోశాధికారి రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బాధ్యులను కలెక్టర్ అభినందించారు.