భద్రాచలం, మార్చి 6: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన పూజలు చేశారు. ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్యహోమాలు చేపట్టారు.
అనంతరం స్వామివారి నిత్య కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకువచ్చి శాస్ర్తోక్తంగా నిత్యకల్యాణ వేడుక నిర్వహించారు. కల్యాణ దాతలకు స్వామివారి ప్రసాదాలను, శేష వస్ర్తాలు అందజేశారు.