ఖమ్మం : మండల పరిధి చింతగుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠామహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావాచనం, రక్షాబంధనము, దీక్షాధారణ, కలశస్థాపన పూజలు, సాయంత్రం జలాదివాసము, ప్రధాన దేవత హోమాలు నిర్వహించారు. వేద పండితుడు రమేష్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ఠామహోత్సవంలో భాగంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ మెంటెం రామారావు, మాజీ సర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ కేతినేని సీతరామయ్య దంపతులు పూజల్లో పాల్గొన్నారు.