ఖమ్మం సిటీ, జనవరి 6: జాతీయస్థాయి టీ – 20 క్రికెట్ పోటీల నిర్వహణ ఖమ్మానికే గర్వకారణమని ఏడీసీపీ బోస్, ఐఎంఏ ఖమ్మం అధ్యక్షుడు బాగం కిషన్రావు పేర్కొన్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న టోర్నీలో శుక్రవారం రెండో రోజు పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ విధమైన టోర్నమెంట్స్ జిల్లా క్రీడాకారులను జాతీయ పోటీల దిశగా మళ్లిస్తాయన్నారు.
భవిష్యత్లో మరెన్నో ఈవెంట్స్ను నిర్వహించాలని ఆకాంక్షించారు. ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ సురేశ్, కేపీఎల్ అధినేత డాక్టర్ కూరపాటి ప్రదీప్, మమత హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ జొన్నలగడ్డ శశికుమార్, డాక్టర్ వైవీ ప్రసాద్, సీనియర్ క్రికెటర్ ఖయ్యూం, ఆర్యన్ సందీప్, నరేష్, మహ్మద్ మతీన్, వీరేశ్గౌడ్, కొండా యాదవ్, వెంకట్, సలీమ్, టీటీ కోచ్ ఓలేటి సాంబమూర్తి, బావర్ గుర్జార్, కార్ ఇన్ నజీమ్ పాల్గొన్నారు.
శ్రీలంక గెలుపు..
క్రికెట్ పోటీల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీలంక, తెలంగాణ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. కార్తీక్ 29, విగ్నేశ్ 24, జీవన్ 13 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లు అనోజ్ లక్షన్, సుదర్శను బెరుగోడ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 96 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.