సత్తుపల్లి: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మండలపరిధిలోని రేజర్ల గ్రామానికి చెందిన కొప్పుల రాఘవరెడ్డి, వేంసూరు మండలానికి చెందిన వీరయ్యలను జిల్లా శాఖ అధ్యక్షులు కళ్యాణపు కృష్ణయ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం డివిజన్ అధ్యక్షులు వీ. అచెంచురెడ్డి, అద్దంకి వెంకటరత్నం, సింగరెడ్డి కేశవ రెడ్డి, మధుసూదన్ రాజు తదితరులున్నారు.