కల్లూరు, ఆగస్టు 13: వెయ్యి మీటర్ల జాతీయ పతాకం.. అంటే అక్షరాలా కిలోమీటర్.. 10 వేల మంది విద్యార్థులు, గ్రామస్తులతో ప్రదర్శన.. విహంగ వీక్షణం నుంచి చూస్తే రహదారిపై మువ్వన్నెల ముగ్గు వేసినట్లు అపురూప దృశ్యం.. అందుకు చక్కటి వేదికైంది కల్లూరు ప్రధాన రహదారి. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన జాతీయ జెండా ప్రదర్శన ఆద్యంతం ఉత్తేజాన్ని కలిగించింది. ‘జై భారత్.. మేరా భారత్ మహాన్.. జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విచ్చేసి సందేశమిచ్చారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పసుమర్తి చందర్రావు, మండల సమితి సభ్యుడు లక్కినేని రఘు, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీవో రవికుమార్, ఎంపీవో వీరాస్వామి, ఏపీఎం వెంకటరామారావు, పీఆర్ జేఈ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఈ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. ఏసీపీ వెంకటేశ్ నేతృత్వంలో రూరల్ సీఐ హనోక్, ఎస్సై వెంకటేశ్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.