ఖమ్మం : డిసెంబర్ 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి పి.చంద్రశేఖర ప్రసాద్ తెలిపారు. శనివారం నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్యాయమూర్తి ఎక్సైజ్ పోలీసు అధికారులను, న్యాయవాదులను కోరారు. సాధ్యమైనంత వరకు ఇరుపక్షాల వారిని ఒప్పించి లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
సివిల్ కేసులను ఎక్కువగా పరిష్కరించేవిధంగా న్యాయవాదులు చొరవ చూపించాలన్నారు. అన్ని రకాల సివిల్ కేసులు, చెల్లని చెక్కుల కేసులు, మోటారు ప్రమాద కేసులువంటి వాటిని పరిష్కరించవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.