ఖమ్మం, డిసెంబర్ 11: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపు సీతారామాంజనేయస్వామి ఆలయం, కాల్వొడ్డు గుంటు మల్లేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, రియల్ ఎస్టేట్ వ్యాపారి గణేశ్ కలిసి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. వేద పండితులు వారిని సతరించి ఆశీర్వదించారు. అనంతరం ఎంపీ ఆలయ సన్నిధిలో అన్నదానానికి రూ.లక్ష విరాళం అందించారు.
నగరంలోని ముస్తఫానగర్కు చెందిన శ్రీదివ్య మణికంఠ అన్నదాన సేవాసమితి సభ్యులు ఐదేళ్ల నుంచి అయ్యప్పమాలధారులకు అన్నసంతర్పణ చేస్తున్నారు. ఈ పుణ్య కార్యానికి సోమవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రూ.లక్ష విరాళం అందించి అయ్యప్ప పూజలో పాల్గొన్నారు. అనంతరం మాలధారులకు భిక్ష వడ్డించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, అన్నదాన సేవా సమితి సభ్యులు చిర్రా రవిస్వామి, పుట్ట మల్లికార్జున్, మాచర్ల నరేశ్, శేఖర్,రవితేజ, చరణ్, గురుబ్రహ్మం, సతీశ్ పాల్గొన్నారు.