చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలఎత్తుకొని జీవిస్తున్నారని, వారి మోముల్లో ఆనందం వికసిస్తోందని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని టీఆర్ఎస్ పార్టీ లోక్సభాపక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
మండల పరిధిలో ప్రోద్దుటూరు-చింతకాని గ్రామాల మధ్య రహదారి విస్తరణ పనులు రూ. 3.23కోట్లు, నాగులవంచ సోసైటీ కార్యాలయంలో రూ.65లక్షలతో నిర్మించనున్న గిడ్డంగికు జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావులతో కలసి సోమవారం ఆయా పనులకు శంకుస్ధాపన చేశారు.