ఖమ్మం, మార్చి 14: ఏపీలోని బాపట్ల పట్టణంలో శుక్రవారం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు, బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు భవ్యతేజ వివాహ మహోత్సవం జరుగనున్నది.
వేడుకకు విచ్చేయాలని గురువారం ఎంపీ హైదరాబాద్లోని సీఎం స్వగృహంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి శుభలేఖ అందజేశారు. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ లీజ్ గడువును మరో 30 ఏళ్లు పొడిగించినందుకు గాను ఎంపీ నామా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వెంట ఆయన సోదరుడు నామా రామారావు ఉన్నారు.