ఖమ్మం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని సప్తపది ఫంక్షన్హాల్లో బీసీ సంఘాలతో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెకల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీలు 46శాతం ఉన్నారని, రీ సర్వే చేయడంతో మరో 1.5 లేదా 2శాతం బీసీల జనాభా పెరుగుతుందని తెలిపారు. అంటే మొత్తం బీసీల జనాభా దాదాపు 48శాతం ఉంటుందని అంచనా వేశారు. 48శాతం బీసీలు ఉంటే… ఏ ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు ? అని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఈ మూడు రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చికులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఏ ఒక అంశంపై అయినా ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం బిల్లు చెల్లకుండాపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మూడు రంగాలకు సంబంధించి వేర్వేరు బిల్లులను పెట్టాలని డిమాండ్ చేశారు. ముస్లింలు, బీసీలకు కలిపి మొత్తం 56శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. రిజర్వేషన్ల విషయంలో హిందువులు, ముస్లింలకు మధ్య బీజేపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ముస్లింల జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు కల్పించాలని, ముస్లింల పేరు చెప్పి ఆయా వర్గాల మధ్య పంచాయతీ పెట్టవద్దని సూచించారు.
గ్రామాల వారీగా ఏ కులంలో ఎంత జనాభా ఉందో ప్రభుత్వం బయటపెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఇప్పటివరకు ప్రభుత్వం బయట పెట్టలేదని, దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా లెకలు సరైనవా కావా అన్నది ప్రజలు తేల్చుకోగలుగుతారని తెలిపారు. సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, రీ సర్వేకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని, టోల్ ఫ్రీ నెంబరులో ప్రజల్లోకి విస్తృ్తతంగా తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల అభివృద్ధికి ఎంతగానో కృషిచేసిందని, అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు 51శాతం అవకాశాలు కల్పిస్తున్నదని గుర్తుచేశారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలిన జనాభా ప్రకారం నిధులు ఖర్చు చేసుకున్నామని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉంటే అభివృద్ధిలో భారత్ ఎప్పుడో అమెరికాను దాటిపోయేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి సంస్థ బీసీలకు న్యాయం కోసం పోరాటం చేస్తుందని, సామాజిక దృక్పథంతో పనిచేస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి అని చెప్పారు. జాగృతి పోరాటాల వల్లనే అసెంబ్లీలో అంబేదర్ విగ్రహం ఏర్పాటు, బతుకమ్మ పండగకు రాష్ట్ర హోదా సాధ్యమయ్యిందని గుర్తుచేశారు.
ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, మదన్లాల్, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఎంబీసీ రాష్ట్ర నాయకురాలు షకీనా, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఉమా, యండపల్లి వరప్రసాద్, మరికంటి ధనలక్ష్మి, నిరోష, ఇంటూరి శేఖర్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీసీలు తమ భావితరాల వారి మంచి కోసం ఐకమత్యంతో ముందుకు సాగాలి. కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం, ఉన్నతికి కృషి చేసి, రాష్ట్రాన్ని బంగారుమయం చేశారు. అందుకు భిన్నంగా రేవంత్రెడ్డి తెలంగాణను అధ్వాన్నంగా తయారు చేస్తున్నారు. 59వేల కోట్లున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను కేసీఆర్ 3లక్షల కోట్లకు తీసుకుపోయారు. బీసీలకు రాజ్యాధికారంలో సముచిత ప్రాధాన్యతనిచ్చి గౌరవించిన గొప్ప నాయకుడు కేసీఆర్.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో మున్నూరుకాపు జనాభాను తగ్గించి చూపడం వల్ల మున్నూరుకాపులకు తీరని నష్టం వాటిల్లనుంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన సర్వేలో మున్నూరుకాపులు 22శాతం ఉంటే కాంగ్రెస్ వారు మూడున్నర శాతం తక్కువ చేసి చూపించారు. రాజకీయ అవకాశాలు లేక కాపులు నష్ట పోతున్నారు. బీసీలందరూ ఐక్యం కావాలి. రాజ్యాధికారం దిశగా ఉద్యమించాలి.
– ఆర్జేసీ కృష,్ణ మున్నూరుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు
రాష్ట్ర జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీ కులాలు అన్ని ఏకమైతే రాజ్యాధికారం తప్పక దక్కుతుంది. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి మరొకరికి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మంలో బీసీలకు అనేక పదవులు వచ్చాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలి. బీసీలకు 46 శాతం రిజర్వేషన్లు దక్కాలి.
– పగడాల నాగరాజు, యాదవ సంఘం నాయకులు