తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రైతుల పక్షాన నిలిచే తీరు, తీరొక్క రంగాలను ప్రోత్సహిస్తున్న విధం బాగుంది.. ఏ ఆపదొచ్చినా నేనున్నా అంటూ ముందుపడే సీఎం కేసీఆర్ పనితీరు ఎంతో నచ్చింది.. ఊరూ వాడా మురిసి మెరిసేలా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం సత్తుపల్లి, మధిర, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధిలో మేమూ భాగస్వాములం అవుతామంటూ మెడలో పార్టీ కండువా కప్పుకున్నారు.
-నమస్తే నెట్వర్క్
వైరాటౌన్, ఆగస్టు 13 : పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ క్యాంపు కార్యాలయం లో వైఎస్ఆర్టీపీకి చెంది న పెరుగు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 150 కుటుంబాలు మదన్లాల్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ టికెట్ ఎవరికి వచ్చినా అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలోని పలు రాష్ర్టాల ప్రజలు తమ రాష్ర్టాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వ పాలన కొనసాగాలని బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
బోనకల్లు, ఆగస్టు 13 : దళితుల బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని చిరునోములలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీరోడ్ల నిర్మాణాలకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో డప్పువాయిద్యాలతో టపాసులు పేల్చుతూ మహిళలు వారికి హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు పార్టీల నుంచి 52 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కొండబాల, కమల్రాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలే వారిని ఆర్థికంగా బలపరిచాయన్నారు.
పదేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, కులాల వారీగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి దళితబంధు పథకాన్ని రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేసి ప్రతి దళితవాడను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ జడ్పీటీసీ బానోతు కొండ, మంకెన రమేశ్, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, ఎస్సీసెల్ నాయకులు గద్దల వెంకటేశ్వర్లు, వెంగళ కనకయ్య, మాజీమండల అధ్యక్షుడు రేగళ్ల వీరయ్య, జిల్లా రజకసంఘం అధ్యక్షులు తమ్మారపు బ్రహ్మయ్య, నాయకులు గరపాకుల రామకృష్ణ, బోడేపూడి నరసింహారావు, పిల్లె వెంకటేశ్వర్లు, కంచర్ల బాబు, జెర్రిపోతుల రవీందర్, యూత్ నాయకులు నిమ్మతోట రవి పాల్గొన్నారు.