పెనుబల్లి/ కల్లూరు, జూన్ 20: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిని మించి విద్యార్థులకు అన్ని వసతులతో కలిసిన నాణ్యమైన విద్యను అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా పెనుబల్లి మండలం టేకులపల్లి, చింతగూడెం, లంకపల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన విద్యా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ‘మన బడి’ ద్వారా సీఎం కేసీఆర్ రూ.7,500 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.
అనంతరం ‘మన బడి’ ద్వారా చేపట్టిన పనులను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ప్రారంభించారు. కాగా, లంకపల్లి మహాత్మాజ్యోతీబాపూలే పాఠశాల విద్యార్థినులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సూర్యనారాయణ, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, ఎం.రమాదేవి, కావూరి మహాలక్ష్మి, వెంకటేశ్వరరావు, గాయం వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి నాగరాజు, కనగాల వెంకట్రావు, భుక్యా ప్రసాద్, వంగా నిరంజన్గౌడ్, లగడపాటి శ్రీను, మరకాల చంటి, సూరపురెడ్డి కిరణ్రెడ్డి, కీసర శ్రీనివాసరెడ్డి, తెల్లగొర్ల జనార్ధన్, పసుమర్తి వెంకటేశ్వరరావు, తావునాయక్, చెన్నారావు పాల్గొన్నారు.
కల్లూరులో..
కల్లూరు మండలం ముచ్చవరం, కల్లూరు, నారాయణపురం గ్రామాల్లోనూ మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముచ్చవరం ప్రాథమిక పాఠశాలలో జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. విద్యా రంగంలో తెలంగాణ దూసుకెళ్తోందని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దామోదరప్రసాద్, రవికుమార్, బాబ్జీ ప్రసాద్, వీరాస్వామి, బీరవల్లి రఘు, కట్టా అజయ్బాబు, గంగవరపు వెంకటేశ్వరరావు, లక్కినేని నీరజ, సరాబు వెంకటేశ్వరరావు, కొండలరావు, నున్నా కృష్ణయ్య, లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, ఇస్మాయిల్, కమ్లీ, కీసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.