సత్తుపల్లి రూరల్, నవంబర్ 15: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి మరోమారు ఆశీర్వదించాలని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఓటర్లను కోరారు. బుధవారం మండలంలోని కాకర్లపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మేళతాళాలు, పూలమాలలతో ఆయనకు స్వాగతం పలికారు. సండ్ర మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్నిరంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశానన్నారు. మట్టిరోడ్డు అనేది లేకుండా బీటీ, సీసీ రోడ్లను గ్రామాల్లో వేశానన్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. కాకర్లపల్లి గ్రామానికి రూ.3కోట్లకు పైగా నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పకటించిన దళితబంధును తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అమలుచేస్తామన్నారు. మూడుసార్లు సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిపించారని, నాల్గోవసారి కూడా తనకు ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కంచర్ల రమాదేవి, ఉపసర్పంచ్ ఏగోటి పెద్దిరాజు, నాయకుడు దేవరపల్లి సత్యనారాయణలతో పాటు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
సత్తుపల్లి, నవంబర్ 15: సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపుకోసం ఆయన సతీమణి మహాలక్ష్మి, కుమారు లు భార్గవ్, తేజలు గడపగడపకూ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ అందులో ఉండే సండ్రను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో సండ్ర చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు. సండ్ర కుమారులు భార్గవ్, తేజలు ఇప్పటికే నియోజకవర్గంలోని వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడలో గడపగడపకూ తిరుగుతూ తన తండ్రి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
కాంగ్రెస్ అంటే అమ్మకం..
సత్తుపల్లి/వేంసూరు, నవంబర్ 15: కాంగ్రెస్ అంటే అమ్మకం…కేసీఆర్ అంటే నమ్మకమని కాంగ్రెస్ గ్యారెంటీలు బూటకమని బీఆర్ఎస్ మ్యానిఫెస్టో శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ నాయకుడు కోటూరి మానవతారాయ్ అన్నారు. బుధవారం వేంసూరు మండలంలోని కుంచపర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తెలుసునని, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన సండ్రకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుని టికెట్ ఇచ్చారన్నారు. తనను మాత్రం నాలుగుసార్లు కాంగ్రెస్ వంచనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందే టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ నాయకులు రేపు అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అమ్ముకుంటారని దుయ్యబట్టారు. సౌమ్యుడు, పేదప్రజల మనిషి, బాధల్లో పాలుపంచుకునే వ్యక్తి సండ్రను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, నవంబర్15: మండలంలోని నూతనకల్, రంగంబంజర గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీకాలనీల్లో బుధవారం సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య తనయులు సండ్ర భార్గవ్, తేజ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి గడపగడపకు తిరుగుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో సండ్రకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధికి రూ. వెయ్యి కోట్ల నిధులు తెచ్చి సత్తుపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మీ ముం దు ఉంచారన్నారు. అనంతరం లక్ష్మీపురం గ్రామంలోని రామాలయంలో అయ్యప్పస్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నూతనకల్ సర్పంచ్ తూము శ్రీనివాసరావు, రంగంబంజర సర్పంచ్ ఎస్.కే.బాబు, ఎంపీటీసీ మోహన్, మాజీసర్పంచ్ శెట్టిపల్లి లక్ష్మణరావు, వైరా ఏఎంసీ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, లక్ష్మీపురం స ర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి, ఉపసర్పంచ్ శీలం ముత్తారెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు దూపాటి నరేష్రాజు, మండల యూత్ అధ్యక్షుడు శీలం శ్రీనివాసరెడ్డి, యూత్ ప్రధాన కర్యాదర్శి కాంపాటి శశికుఆర్, యూత్ ప్రచార కార్యదర్శి పమ్మి కృష్ణారావు, సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్రెడ్డి, ఉపసర్పంచ్ షేక్ సీతారాములు, నాయకులు గొల్లమందల శ్రీనివాసరావు, తూము సాయి, బలవంతపు రవీందర్, పవన్దేవాన్ష్, మేడి అనిల్, పమ్మి నర్సింహారావు, పమ్మి రాజా, సురేశ్, అంజయ్య, మల్లికార్జున్, ముకర రవి పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్15: మండలంలోని రా మచంద్రరావుబంజరలో బీఆర్ఎస్ నాయకులు ఇం టింటి ప్రచారం చేశారు. కారు గుర్తుపై ఓటు వేసి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని కో రారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. సండ్ర హ యాంలోనే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెం దిందని, రానున్న రోజుల్లో సండ్రతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కల్లూరు, నవంబర్ 15: సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపు కోసం బుధవారం పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ఓటర్లకు పంచుతూ చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్, నవంబర్ 15: సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు అత్యధిక మెజార్టీ అందిస్తామని మండలంలోని తుంబూరు గ్రామస్తులు తెలిపారు. బుధవారం తుంబూరులో సీనియర్ నాయకుడు కూసంపూడి మాధవరావు ఇంటికి వెళ్లిన సండ్రను కలిసి సంఘీభావం తెలిపి మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ కృష్ణమూర్తి, మాదిరాజు బంగార్రావుశర్మ, కూసంపూడి రామారావు, మోరంపూడి శ్రీనివాసరావు, కొప్పుల అప్పారావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.