వేంసూరు, అక్టోబర్12: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన కుంచపర్తి, బీరాపల్లి, గూడూరు, కల్లూరుగూడెం దూళ్లకొత్తూరు, రాయుడుపాలెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం పలుచోట్ల నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేసి చూపించిందన్నారు.
ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచనా లేకుండా కృషి చేశానని, ఇకముందు కూడా అదేవిధంగా పని చేస్తానన్నారు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. దళితబంధుపై కాం గ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దళితబంధు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఎవరూ అధైర్యపడొద్దని ప్రజ లకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటిరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, సీడీసీ డైరెక్టర్ పుచ్చకాయల శంకర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
కుంచపర్తికి చెందిన 30 కుటుంబాలు గురువారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతోమంది బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో కోటమర్తి చిన్నకృష్ణ, కిన్నెర పుల్లయ్య, కిన్నెర ఆనందరావు, కిన్నెర సీతారాములు, కిన్నెర నాగేశ్వరరావు, కొరకొప్పుల సీతారాములు, కంచర్ల బాలస్వామి, కిన్నెర పెద్దబాబు, బీమాల కుటుంబరావు, మోటపోతుల శ్రీను, ఇజ్జగాని కేశవులు, బలగాని నాగరాజు, మోటపోతుల సత్యం పాల్గొన్నారు.