సత్తుపల్లి, మే 9 : సత్తుపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర పురపాలక శాఖ కేటీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలోని మంత్రి కేటీఆర్ను ఆయన చాంబర్లో కలిసి కృతజ్ఞతలు చెప్పారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. సత్తుపల్లిలో రూ.60 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరుకావాలని కోరారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్యఅతిథిగా రావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.