భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని రైటర్బస్తీలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మొక్కలు నాటి మాట్లాడారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని, పర్యావరణ పరిరక్షణకు ఇది నిజమైన చాలెంజ్ అన్నారు. మొక్కలు నాటి సంరక్షించుకోవడం వల్ల నేలతల్లికి, సమాజానికి ఎంతో ఉపయోగకరమన్నారు. మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటడం తప్పనిసరి అని పేర్కొన్నారు.