వైరా టౌన్, ఏప్రిల్ 26: అన్నదాతల వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ నిలిచారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్తో కలిసి ఎమ్మెల్యే రాములునాయక్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. పంటల సాగుకు పెట్టుబడి లేక రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రైతుబీమా పథకం కూడా ఎంతో గొప్పదని అన్నారు. దేశంలోనే ఇలాంటి అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని గుర్తుచేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇందుకోసం కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయడం రైతులకు వరమని అన్నారు.
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు భద్రరాజు, బాబూరావు, బాలాజీ, పవన్కుమార్, అరుణ, నాగేశ్వరి, వేల్పుల పావని, నంబూరి కనకదుర్గ, లాల్మహ్మద్, బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, అమరనేని మాధవరావు, డాక్టర్ కోటయ్య, సక్కుబాయి, రవీందర్రెడ్డి, కాపా మురళీకృష్ణ, కృష్ణార్జున్రావు, మచ్చా బుజ్జి, పసుపులేటి మోహన్రావు, మున్సిపాల్ బీబాసాహెబ్, మనోహర్, దాసరి శ్రీను, కొప్పుల వెంకటేశ్వరరావు, సింగవరపు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.