కారేపల్లి, ఫిబ్రవరి 4: ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని బిక్యాతండాలోని తిరుపతమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణంలో ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సృష్టిలో దైవమార్గాన్ని మించింది మరొకటి లేదన్నారు. కార్యక్రమంలోఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పెద్దబోయన ఉమాశంకర్, ఇస్లావత్ బన్సీలాల్, నాయకులు ముత్యాల సత్యనారాయణ, ఆజ్మీరా వీరన్న, దుగ్గినేని శ్రీను, బత్తుల శ్రీనివాస్, అడ్డగోడ ఐలయ్య, అడప పుల్లారావు, బానోత్ కుమార్, మాళోత్ కిశోర్, కుర్సం సత్యనారాయణ, ఆజ్మీరా నాగేశ్వరరావు, డేగల ఉపేందర్, రోశయ్య, బిందె రమేశ్, పిల్లి వెంకటేశ్వర్లు, ఆంగోత్ మత్రు, వాంకుడోత్ నరేశ్, భూక్య రాంకిశోర్, బానోత్ కోటి, తొగర శ్రీను, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వైరాటౌన్, ఫిబ్రవరి 5: వైరా మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆదివారం పర్యటించి పలు శుభకార్యాలకు హాజరయ్యారు. వైరా రిజర్వాయర్లోని స్విమ్మర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నాగార్జున వెంకటయ్య, చావా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ చాలిసా, శ్రీరామచంద్రుల కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వారిని కమిటీ సభ్యులు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం 18వ వార్డులో మృతిచెందిన కౌన్సిలర్ ధనేకుల వేణు తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, వైరా పట్టణ, రూరల్ అధ్యక్షులు దార్న రాజశేఖర్, బాణాల వెంకటేశ్వరరావు, దిశా కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జున్రావు, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేశ్, వైరా చేపల సొసైటీ చైర్మన్ షేక్ రహీం, మిషన్ భగీరథ రాష్ట్ర అధ్యక్షుడు మద్దెలరవి, కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, దారెల్లి కోటయ్య, లక్ష్మీభాయి, చల్లగొండ్ల నాగేశ్వరరావు, తడికమళ్ల నాగేశ్వరరావు, ఇమ్మడి రామారావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అప్పం సురేశ్, కోదండరామ దేవస్థాన చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, నాయకులు పణితి సైదులు, కర్నాటి హనుమంతరావు, ఏదునూరి శ్రీనివాసరావు, మరికంటి శివ, సూర్యదేవర శ్రీధర్, పాసంగులపాటి కోటేశ్వరరావు, వేల్పుల మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబూలాల్, కొణిజర్ల నాయకులు, పోట్ల శ్రీనివాసరావు, వై.చిరంజీవి, డేరంగుల బ్రహ్మం, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, కోపిల తంబి పాల్గొన్నారు.