ఖమ్మం రూరల్, జనవరి 25: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ఇంటింటికీ చేర్చాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆదేశించారు. ‘ఇంటింటికీ కంటి వెలుగు’ పేరిట రాబోయే మూడు నెలలపాటు ప్రతి గ్రామంలోనూ శిబిరాలు నిర్వహించి ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని సూచించారు. ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్తో బుధవారం సందర్శించారు. ఈ కేంద్రానికి వచ్చిన గ్రామస్తులతోనూ, పరీక్షలు చేయించుకుంటున్న వృద్ధులతోనూ మాట్లాడారు. అనంతరం అవసరమైన వారికి కళ్ల అద్దాలు అందజేశారు. అనంతరం కేంద్రంలో వైద్య సేవలను అందిస్తున్న వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ వారికి పలు సూచనలు చేశారు. కంటి చూపు కనపడని వారిలో కొత్త వెలుగులు తీసుకరావాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. తొలివడతలో రాష్ట్రంలోని లక్షలాదిమందికి కంటి పరీక్షలు చేసి కళ్ల అద్దాలు ఇవ్వడంతో మంచి ప్రయోజనం చేకూరిందని గుర్తుచేశారు. మిగిలిన వారికి, గతంలో కళ్ల అద్దాలు తీసుకున్న వారికి మరోమారు కంటి పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతోనే ఈ మలి విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు యండపల్లి వరప్రసాద్, మేదరమట్ల సుభద్రమ్మ, బెల్లం వేణుగోపాల్, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.
‘పేదల కళ్లల్లో ఆనందం నింపేందుకే కంటి వెలుగు’
మధిర టౌన్, జనవరి 25: పేదల కళ్లల్లో ఆనందం నింపేందుకే కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిర పట్టణం బంజారాకాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లతతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో వైద్యులు అందుబాటులో ఉండి కంటి పరీక్షలు చేస్తారని, అవసరమైన వారికి కళ్ల అద్దాలు అందిస్తారని అన్నారు. ప్రజలెవరూ కంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. నాయకులు బిక్కి ప్రసాద్, అప్పారావు, మాధవి, రంగిశెట్టి కోటేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, కరివేద సుధాకర్, మేడికొండ కిరణ్, మొండితోక జయాకర్, సయ్యద్ ఇక్బాల్, బీవీఆర్, శీలం వెంకటరెడ్డి, అరిగె శ్రీనివాసరావు, భువనగిరి నారాయణ, ప్యారీ, రామన్, రాజా తదితరులు పాల్గొన్నారు.
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వైరా టౌన్, జనవరి 25: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేసి అన్ని కుటుంబాల్లోనూ వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సూచించారు. కంటి వెలుగు శిబిరాలకు గ్రామాల్లో విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. వైరాలో నూతన వసతులతో రీ మోడలింగ్ చేసిన పాత పంచాయతీ భవనాన్ని, 3వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం పంచాయతీ పాత భవనాన్ని ఆధునీకరించి కొత్త హంగులతో తీర్చిదిద్దినట్లు చెప్పారు. అలాగే కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకుంటున్నారని వివరించారు. మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్తోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు సూతకాని జైపాల్, ముళ్లపాటి సీతారాములు, ఎదునూరి పద్మజ, అనిత, ఇటుకల భాస్కర్, దారెల్లి పవిత్రకుమారి, కన్నెగంటి సునీత, గుగులోతు లక్ష్మీబాయి, వనమా విశ్వేశ్వరరావు, కట్టా కృష్ణార్జున్రావు, సూర్యదేవర శ్రీధర్, కన్నెగంటి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.