భద్రాచలం, మార్చి 21 : హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీజీడబ్ల్యూఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రఘునాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.