తల్లాడ, జూన్ 8: మిషన్ కాకతీయ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కర్షకుల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేని, ఆయన కృషి వల్లనే నేడు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి తల్లాడ మండలంలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత తల్లాడ సొసైటీ నుంచి ఎదుళ్ల చెరువు వరకు 3 కి.మీ మేర కోలాటం, బతుకమ్మలు, బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎదుళ్లచెరువులో చెరువుకు పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ నామా మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు తెలియజేయడమే ఉత్సవాల ఉద్దేశమని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా జలాశయాల్లో పూడిక తీయించి మండుటెండల్లోనూ జలకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దారని వివరించారు.
అన్నదాతల కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్: వద్దిరాజు
మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాల ద్వారా అన్నదాతల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా 26,932 చెరువుల్లో పూడికలు తీయించి నీళ్లు నిల్వ చేసే విధంగా కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
కళకళలాడుతున్న చెరువులు, కుంటలు: పార్థసారథిరెడ్డి
మిషన్ కాకతీయ పథకం ద్వారా పూడిక తీయించడతో చెరువులు, కుంటలన్నీ మండుటెండల్లోనూ నీళ్లతో కళకళలాడుతున్నాయని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. తన సొంత గ్రామంలో రూ.4 కోట్లతో చెరువులను అభివృద్ధి చేశామని, తద్వారా సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం అన్ని వేళలా ఉంటుందన్నారు.
మూడు నెలల్లో తల్లాడకు రూ.25 కోట్లు: ఎమ్మెల్యే సండ్ర
తల్లాడ గ్రామ పంచాయతీకే మూడు నెలల్లో రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కొందరు స్వార్థపరులు, అవకాశవాదులు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు. నియోజకవర్గంలోని 300కు పైగా చెరువులను మిషన్ కాకతీయ పథకంలో అభివృద్ధి చేశామని వివరించారు. గడిచిన మూడేళ్లలో సత్తుపల్లి నియోజకర్గంలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో పజాప్రతినిధులు, అధికారులు రాయల వెంకటశేషగిరిరావు, గంటా శ్రీలత, రవీందర్రెడ్డి, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, పొట్టేటి సంధ్యారాణి, జొన్నలగడ్డ కిరణ్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బద్ధం కోటిరెడ్డి, పెరిక నాగేశ్వరరావు, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, గుండ్ల నాగయ్య, కోడూరి వీరకృష్ణ తదితరులు పాల్గొన్నారు.