ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రఘునాథ పాలెంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల ఖమ్మం-1 బాలికల కళాశాల విద్యార్ధులు సత్తా చాటారు. గురుకులానికి చెందిన మొగల్ సమ్రీన్ విద్యార్ధిని 463మార్కులతో రాష్ట్ర స్థాయిలో రాణించింది. బైపీసీలో అంజుమ్ విద్యార్ధిని 423మార్కులు సాధించింది. వీరితో పాటు ఎంపీసీలో మరో ఎనిమిది మంది, బైపీసీలో మరో విద్యార్ధిని అత్యధిక మార్కులు సాధించింది.
కాగా ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్ధులను తెలంగాణ మైనారిటీ గురుకులాల డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ అధికారి ఆసీఫుద్దీన్, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ అధికారి జ్యోతి, రీజనల్ కో-ఆర్డినేటర్ అనిత, విజిలెన్స్ అధికారులు జమీల్ పాషా, సీతరాములు, కళాశాల ప్రిన్సిపాల్ అబిదా సల్మా, ఉపాధ్యాయులు అభినందించారు.