ఖమ్మం, నవంబర్ 2: జంట నగరాలకు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేశానని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని 45వ డివిజన్లో ఖమ్మం కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో మంత్రి అజయ్కుమార్ పాల్గొని మాట్లాడారు. నగరంలో నేటి వరకు ఎలాంటి వసూళ్లు, చందాలకు పాల్పడకుండా, బెదిరింపులు లేకుండా ఖమ్మం శాంతి భద్రతలకు నిలయంగా మార్చామని అన్నారు. ఎన్ని కల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు పారుపల్లి రమేష్, హరిగోపాల్, రమణ, కృష్ణారెడ్డి, చరణ్, నవీన్, నంద, మౌలాలి, సాహు, నర్సింహారావు, కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు, బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, మెడికల్ రిప్రజెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఖమ్మం, నవంబర్ 2: చిరువ్యాపారులకు అండగా ఉంటానని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో గురువారం సాయంత్రం 44వ డివిజన్లో కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ అధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తనపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నోటికి వచ్చిన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఖమ్మం నగరాన్ని తాను అహర్నిశలు శ్రమించి అభివృద్ధి చేశానని, కానీ తుమ్మల మాత్రం తానే అభివృద్ధి చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తాను నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించానన్నారు. గెలిచినా, ఓడినా తాను ప్రజల మధ్యే ఉంటానన్నారు. తన హయాంలోనే చిరువ్యాపారుల కోసం సముదాయాలు నిర్మించానన్నారు. సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, దోరేపల్లి రవికుమార్, తాజుద్దీన్, తాళ్లూరి జీవన్కుమార్, శీలంశెట్టి వీరభద్రం, జకుల లక్ష్మయ్య, జాని, తిరుమలరావు, కోటి, రామారావు, శ్రీనివాస్నాయక్, సెహానా బేగం, మోయిన్, సర్దార్బీ, ఖలీల్ పాల్గొన్నారు.
ఖమ్మం, నవంబర్ 2: ఖమ్మం నగరంలోని బృందావనం గార్డెన్స్లో గురువారం సాయంత్రం మంత్రి అజయ్కుమార్ కేబుల్ టీవీ ఎంఎస్వో, కేబుల్ ఆపరేటర్స్, టెక్నీషియన్స్తో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొమ్మిదిన్నరేళ్ల నుంచి తాను కేబుల్ ఆపరేటర్స్కు అండగా ఉంటున్నానన్నారు. ఎంఎస్వోల సమస్యలు పరిష్కరించి ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, పల్లా రాజశేఖర్, ఎంఎస్వోలు యార్లగడ్డ రాఘవ, వెరపనేని శ్రీనివాస్, కనపర్తి సంజీవరావు, ఎండీ ఉస్మాన్, పేడేటి వెంకట్, పాలడుగు పాపారావు, ఉపేందర్, ప్రవీణ్, భరత్, ఆదినారాయణ, రామారావు పాల్గొన్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 2: నగరంలోని పాఠశాలలో గురువారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం నగరాన్ని గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు దీటుగా అభివృద్ధి చేశానన్నారు. ఐటీ హాబ్ ద్వారా వందలాది మందికి సాప్ట్వేర్ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించానన్నారు. అభివృద్ధిని కొనసాగించేందుకు మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల చైర్మన్ ఇంజం వెంకటరమణారావు, డైరెక్టర్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్ లక్ష్మీనాగేశ్వరరావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు, హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత రవిమారుత్, నాయకులు రాంప్రసాద్, గోపిరెడ్డి, అమరగాని వెంకన్న పాల్గొన్నారు.
ఖమ్మం, నవంబర్ 2: ఖమ్మం నగరం చైతన్యనగర్లోని శ్రీధర్మశాస్త అన్నదాన సేవా సమితి ట్రస్ట్ ద్వారా 40 రోజుల పాటు అయ్యప్ప మాలధారులకు అన్నప్రసాదాలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. గురువారం ఈ మేరకు ట్రస్ట్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అయ్యప్పస్వామి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ట్రస్ట్ చైర్మన్ మేకల హనుమంతరావు, 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి, నాయకులు పగడాల నాగరాజు, పొన్నం వసంత్, అట్లూరి మధు, పుల్లం రాజు, వల్లభనేని రామారావు, బత్తుల మురళి, గోపి పాల్గొన్నారు.