రఘునాథపాలెం, సెప్టెంబర్ 23 : పూలను పూజించడం తెలంగాణ సంస్కృతి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దసరా పండుగ రోజున రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డా కొత్త చీరె కట్టుకొని సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. అందుకోసమే గడిచిన ఆరేళ్లుగా బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలకు చీరెను సారెలాగా పంపుతున్నారని అన్నారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తరువాత మన భాష, యాసలను టీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుతోందని అన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతూనే వాటన్నింటినీ మనకు దగ్గర చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. తెలంగాణ ప్రజల అతి పెద్ద పండుగ ‘బతుకమ్మ’ను అధికారికంగా నిర్వహించే ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు ఎంతో ప్రాధాన్యం కలిగిన బతుకమ్మ సందర్భంగా ప్రతి మహిళకే బతుకమ్మ చీరెను అందించడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1.3 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేస్తోందన్నారు. ఇందుకు కోసం ఏటా రూ.317 కోట్లను వెచ్చిస్తోందని అన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో సిరిసిల్ల చేనేత కార్మికులతో విభిన్న రకాల ఆకర్షణీయమైన డిజైన్లతో నాణ్యమైన చీరెలను తయారు చేయించారని గుర్తుచేశారు.
ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి: ఎంపీ నామా
ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధించినట్లు అవుతుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. దసరా పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
పూల పండుగ మనకే ప్రత్యేకం: ఎంపీ వద్దిరాజు
పూలను పూజించ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైనదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పూల పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరు జరుపుకున్నా దానికి మూలం మన సంస్కృతీ, సంప్రదాయాలేనని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. కార్యక్రమానికి ముందుగా ఐకేపీ మహిళలంతా కలిసి మంత్రి, ఎంపీలకు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, భుక్యా గౌరి, గుడిపుడి శారద, మద్దినేని వెంకటరమణ, పిన్ని కోటేశ్వరరావు, కుర్రా భాస్కర్రావు, అజ్మీరా వీరూనాయక్, మందడపు సుధాకర్, లక్ష్మణ్నాయక్, బోయినపల్లి లక్ష్మణ్గౌడ్, బానోతు ప్రమీల, గుడిపూడి రామారావు, చెరుకూరి పూర్ణ, రామకృష్ణ, ప్రసన్నకుమార్, కుందేసాహెబ్, అల్లిక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.