మామిళ్లగూడెం, జూన్ 6: సుపరిపాలనకు గొప్ప ఆలోచనలు చేస్తూ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ఐడీవోసీలో రూ.17 లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ గదికి మంగళవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. రూ.100.78 లక్షలతో చేపట్టనున్న సోలార్ షెడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఐడీవోసీ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో రెండో విడతలో 1.51 లక్షల మందికి కంటి పరీక్షలు చేపట్టామన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మొదటిసారి 43 శాతం, రెండోసారి 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి.. తొమ్మిదేళ్లలో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురసరించుకుని సుపరిపాలనా దినోత్సవం రోజున ధరణి గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ 5,800 చదరపు మీటర్లతో పారింగ్ స్థలం ఏర్పాటు చేశామని, సోలార్ రూఫ్ పారింగ్ షెడ్కు రూపకల్పన చేశామని అన్నారు. ఐడీవోసీలో 41 శాఖలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు, వీటికి 230 కిలోవాట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ షెడ్తో పారింగ్ సమస్య పరిషారంతోపాటు 110 కిలోవాట్ల పవర్ ఉత్పత్తి అవుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ, టీఎస్ సీడ్స్, సుడా చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు, బచ్చు విజయ్కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, శిక్షణ సహాయ కలెక్టర్లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు, వీ వెంకటాయపాలెం పాలెం సర్పంచ్ రావెళ్ల మాధవి తదితరులు పాల్గొన్నారు.