ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.. మెరుపు విజయాలను సాధించారు.. అద్భుతమైన ఫలితాలను రాబట్టారు.. తల్లిదండ్రులతో పాటు ఆయా కళాశాలలకు పేరు తీసుకొచ్చారు.. విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి.
– ఖమ్మం ఎడ్యుకేషన్, మే 9
‘శ్రీచైతన్య’ సంచలనం….
ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జూనియర్ ఎంపీసీలో శిరీష, సాయిపూజ, యజ్ఞశ్రీ, సదాచంద్, కిరణ్కుమార్, సంతోష్, సిరి, భార్గవి, సింధుప్రియ, భవ్యశ్రీ, కరుణ 467 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో కావ్య 436, నసీమ్ 435, సీఈసీ విభాగంలో ఆర్మన్పాషా 490 మార్కులు, హెచ్ఈసీలో లక్ష్మీ శ్రీజ 484 మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీలో లోకేశ్, ఉషశ్రీ 992 మార్కులు, ఇందు 991, భరత్, సదీయా తక్వీమ్, శ్రీవాత్సవ 990 మార్కులు, బైపీసీలో గాయత్రి, పూజిత 992, మేఘన 991 మార్కులు, ఎంఈసీలో తేజశ్రీసాయి 985, సీఈసీలో నికితాదాస్ 963 మార్కులు సాధించారు. విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, అకడమిక్ డైరెక్టర్ బి.సాయి గీతిక, డీజీఎం చేతన్మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ అభినందించారు.
‘కృష్ణవేణి’ సత్తా..
కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో పి.రాజేష్ 994 మార్కులు, రోహిత , వై.కావ్య 990, యమున, పి.కావ్య, భావన 989, బైపీసీలో లక్ష్మి, కె.కావ్య, లీనా భార్గవి 989, ఎంఈసీలో శారదా శ్రీహిమజ 986, దుర్గా తన్మయి 984 మార్కులు, జూనియర్ ఎంపీసీలో జ్ఞానిత, చాతుర్య, వేణు, నాగచైతన్య, జ్యోత్స్న, త్రిషిక, చందనాప్రియ, హర్షవర్థన్, హాసిని 466 మార్కులు, బైపీసీలో జిషిత, ఫర్హాత్ ఆజీస్, సాయికిరణ్, ఉమాశ్రీ, సాద్విక్, దివ్యమేఘన వైవార్షిత, పూజిత 434 మార్కులు, సీఈసీలో సుహానా 479 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు గోల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాంచందర్ అభినందించారు.
‘న్యూవిజన్’ విజయ దుందుభి..
ఇంటర్ ఫలితాల్లో న్యూవిజన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. జూనియర్ ఎంపీసీలో మోహన్ ఆదిత్య, షబానా, విధ్వత్, భవిత 467 మార్కులు, బైపీసీలో వి.జాగృతి పవార్ 434, సాయివరుణ్, జ్యోతి, నమ్రత, అఖిల 433, జస్వంత్రామ్ 432, సీనియర్ ఎంపీసీలో కావ్య, అఖిలేష్ వెంకట్ 991, చంద్రసాయి అనిరుధ్, హర్షిణి 990, జస్మిత, యస్వంత్చౌదరి, భవ్య, అశ్రిత, ఉభయేంద్ర సాయి 989, బైపీసీలో గాయత్రి, మళీ హతఖ్దీస్ 990, మోహిత్ 989 మార్కులు సాధించారు. విద్యార్థులను విద్యాసంస్ధల చైర్మన్ చుంచు గోపాలకృష్ణ ప్రసాద్, డైరెక్టర్ సీహెచ్ గోపిచంద్ అభినందించారు.
‘హార్వెస్ట్’ హవా
ఇంటర్ ఫలితాల్లో హార్వెస్ట్ కళాశాల విద్యార్థుల హవా కొనసాగింది. సీనియర్ ఇంటర్లో పావని 988 మార్కులు, భానుప్రకాశ్ 985, సాయికేతన్రెడ్డి 978, హర్షిత్ 975, ఆకాంక్ష 969, గణేష్రెడ్డి 967 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీలో చంద్రసిద్దార్థ 459, గణేశ్ గౌతమ్ 459, శ్రవణ్కుమార్ 456, వంశీ, సంధ్య, రాజీవ్ 454, శరత్కుమార్, నాగఫణి 451 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి అన్నారు.
‘రెజొనెన్స్’ విజయం..
రెజొనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరిశారు. సీనియర్ ఎంపీసీలో లక్ష్మీసాయి 992, వైష్ణవి, మౌళిక 991, భార్గవి 989, సిద్దార్థ, మేఘన 987, బైపీసీలో ఎండీ నాజియా అంజుం 989, జాహ్నవి 983, సాయిదర్శన 980 మార్కులు, జూనియర్ ఎంపీసీలో నందిని 467, లక్ష్మీప్రసన్న, నిహారిక 466, చంద్రశేఖర్, రాకేశ్ సుశాంత్, సాయితేజ, విఘ్నేష్, హైమావతి 465 మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీలో ఫర్హీన్ బేగం 430, వాసు శ్రీహిత 426, లిఖిత 425 మార్కులు సాధించారు. విద్యార్థులను డైరెక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్, ప్రిన్సిపాల్స్ సతీశ్, భాస్కర్రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.
‘నారాయణ’ విజయ బావుటా..
ఇంటర్ ఫలితాల్లో నారాయణ కళాశాల విద్యార్థులు విజయ బావుటా ఎగురవేశారు. జూనియర్ ఎంపీసీలో సాయికుసుమిత 467, కౌస్తుభ్ గుప్తా 466, సంజన, రిషిత, భవిష్య, సాయితేజ 465 మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో శ్రీహారిక 986, యువన 985, రాగమయి 984, సాయిసందీప్రెడ్డి, ప్రియ 981 మార్కులు సాధించారు. బైపీసీలో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులను డీన్ వెంకటరెడ్డి, డీన్ పాటి మాధవరావు, ఏజీఎం సురేశ్బాబు అభినందించారు.
‘ఎస్ఆర్’ విజయ కేతనం..
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. ఎంపీసీలో అనిత, శ్రీజ 467, మణిచందన, నందిత, హరిణిశ్రీ, శివ 466, సౌమ్య 465, భువనేశ్వరి, భావన, పునీస, నజ్మీన్, సాత్వికారెడ్డి, స్ఫూర్తి, పావని, నిహారిక 464, బైపీసీలో లిఖిత 435, రుగ్విత రోస్ 434, తేజస్విని 433, నిఖిత 431 మార్కులు సాధించారు. విద్యార్థులను చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్లు సంతోశ్రెడ్డి, మధుకర్రెడ్డి, సీఈవో సురేందర్రెడ్డి, జోనల్ ఇన్చార్జి విజయభాస్కర్రెడ్డి, డీన్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ అభినందించారు.
స్టన్నింగ్ ‘వెలాసిటీ’ రిజల్ట్స్..
ఇంటర్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఎంపీసీలో నిహారిక 466, హనుజప్రియ, లక్ష్మీనవ్యశ్రీ 465, సమీర్, గీతా అభినయలక్ష్మి, అస్మా ఫిర్దోస్, నిషిత 464 మార్కులు సాధించారు. బైపీసీలో సంజన 431, శ్రీవిద్య 407, నిర్మల 404, ప్రీతి 404 మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీలో యశ్వంత్ 990 మార్కులు, వినీత్ 982, బైపీసీలో మంజుల 966 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ శెట్టి లక్ష్మణ్రావు, కరస్పాండెంట్ మల్లోలు రవి, డీన్ మహ్మద్ యాకుబ్, అధ్యాపకులు అభినందించారు.
‘ఎక్స్లెంట్’ విక్టరీ..
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఎక్స్లెంట్ కళాశాల విద్యార్థులు విక్టరీ సాధించారు. జూనియర్ ఎంపీసీలో పార్థివ్ సాయినగేశ్ 462 మార్కులు, లక్ష్మీపూర్ణిమ, ఉమేష్ చంద్రన్ 461, బైపీసీ విభాగంలో దివ్యతార 430, యశస్విని సరోజ 426, మణిశంకర్ 416, ద్వితీయ సంవత్సరంలో హన్సిక 983, అంజన, నవ్యమాధురి, బిందు 981మార్కులతో సత్తా చాటారు. విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ చల్లా శేషగిరి, అధ్యాపకులు అభినందించారు.
‘సాహితి’ ట్రెండింగ్ రిజల్ట్స్..
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సాహితీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఎంపీసీలో పవన్కల్యాణ్ 460, ఉదయ్కిరణ్ 457, బైపీసీలో తేజస్విని 431, తనూజశ్రీ 423 మార్కులు, సీనియర్ ఎంపీసీలో సాయిప్రశాంతి 971, రంజిత 966, బైపీసీలో కావ్య 973, జ్యోత్స్నకుమారి 949, సీఈసీలో 952 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ నాగేశ్వరరావు, సెక్రటరీ వై శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ వెంకన్న, డైరెక్టర్ తిరుపతయ్య అభినందించారు.
‘శ్రీనలంద’ విజయభేరి
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 9: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కొత్తగూడెం శ్రీనలంద కాలేజీకి చెందిన విద్యార్థులు విజయ భేరి మోగించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కొండా వెంకటమోహన వంశీ వెయ్యి మార్కులకు 989 మార్కులు, కోట యువరాజ్ 988, ముగిడి వెంకటలక్ష్మి 988, శెట్టి వేణు 988 మార్కులతో టాప్గా నిలిచారు. సీనియర్ బైపీసీ విభాగంలో నామిని సిరి వెయ్యి మార్కులకు గాను 988 మార్కులు, మోగులోజు స్పందన 987 మార్కులు సాధించారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో ఎం.ఆశ్రిత కల్యాణి 972 మార్కులు, పి.సృజన వేణి 971 మార్కులు, సీనియర్ సీఈసీలో పప్పుల లక్ష్మి 981 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీలో కడారి వరుణ్ 470 మార్కులకు 467 మార్కులు, చావా భావనా చౌదరి 466 మార్కులు, జి.సాయిచరణ్ 466, సాయిమనోజ్ 465, పి.స్నేహ 465, మనోజ్ఞశ్రీ 465, సీహెచ్ విజయ్కుమార్ 465 మార్కులు సాధించారు. కళాశాలకు చెందిన 32 మంది 460 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ బైపీసీలో సాయిసమైక్య 440 మార్కులకు 433 మార్కులు, డి.శ్రావణి 430 మార్కులు సాధించారు. మరో ఐదుగురు 420 మార్కులకు పైగా సాధించారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో నోముల రాజేష్ 500 మార్కులకు 479 మార్కులు, సరికండ ఆశ్రిత 469 మార్కులు, జూనియర్ సీఈసీలో కొయ్యడ సాయిరిషిత 463 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ లయన్ ఎంవీ చౌదరి, సీఈవో చైతన్యకృష్ణ, ప్రిన్సిపాల్ ఐవీ మల్లికార్జున్రావు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
‘సిరి చైతన్య’ మెరుపులు..
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సిరి చైతన్య కళాశాలకు చెందిన విద్యార్థులు మెరిశారు. సీనియర్ ఎంపీసీలో శివాని 962 మార్కులు, బైపీసీలో స్రవంతి 966, సీఈసీలో రాంచరణ్ 912 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీలో దివ్య 465, లెనిన్కుమార్ 464 మార్కులు సాధించారు. విద్యార్థులను కరస్పాండెంట్ సోమయ్య, అధ్యాపకులు అభినందించారు.
‘సీవీ రామన్’ విజయ ఢంకా..
సీవీ రామన్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విజయ ఢంకా మోగించారు. సీనియర్స్ ఎంపీసీలో దుర్గాభవాని 969, జస్వంతి, హనుమంతు 966, బైపీసీలో నందిని 973, ఈశ్వర్ 965 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీలో లవణ్కుమార్, రాజేశ్ 464, ఉమారాణి 459, బైపీసీలో ప్రణయ్ 433, సీఈసీలో ఉదయశ్రీ 470 మార్కులు సాధించారు. విద్యార్థులను యాజమాన్యం పావని, రవికుమార్, ప్రిన్సిపాల్ నర్సింహారావు అభినంధించారు.
‘కృష్ణవేణి’ ప్రభంజనం
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 9: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కొత్తగూడెం కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీలో విద్యార్థులు హర్షవర్థన్, త్రిషిక, చందనప్రియ 470 మార్కులకు 466 మార్కులు, సంజయ్ తరుణ్ 465 మార్కులు, ఈశ్వర్ 465 మార్కులు, ఇందు 464 మార్కులు, ఎండీ మహెక్ తబస్సమ్ 464, వైష్ణవి 464 మార్కులు, దేవీప్రియ 464 మార్కులు, అనురాధ యాదవ్ 464 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు ఉమశ్రీ, పూజిత, అజీన్, సాయికిరణ్, సాద్విక్ 434 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు వైష్ణవి 987 మార్కులు, మేఘశ్రీ 986, షబానా 984 మార్కులు, యశస్వీ 983 మార్కులు, శ్రీనిధి 983 మార్కులు, మనోహర్రెడ్డి 983 మార్కులు, అఖిల్ 983 మార్కులు, ధరణి 982 మార్కులు, యశ్విత 980 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో లీనాభార్గవి వెయ్యికి 987 మార్కులు, షాహీనా 980 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో భావన వెయ్యికి 981 మార్కులు సాధించింది. విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి జగదీశ్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ బి.వీరన్న అభినందించారు.