ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ 46వ డివిజన్ నయా బజార్ సర్కిల్లో రూ.38.60 లక్షలతో నిర్మించనున్న వీధి వ్యాపారుల దుకాణ సముదాయానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అలాగే 9వ డివిజన్ రోటరీ నగర్లో రూ.37 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల దుకాణ సముదాయాన్ని మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.