ఖమ్మం, ఫిబ్రవరి 14: తెలంగాణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఎలా నిర్మిస్తోందనేందుకు ఖమ్మం మార్కెట్ ఒక నమూనా అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫొటోలను ట్విటర్లో పోస్టు చేశారు.
ఖమ్మం నూతన సమీకృత మార్కెట్ అద్భుతంగా నిర్మించినందుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ను మంత్రి కేటీఆర్ ఆభినందించారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రి పువ్వాడను అభినందించిన విషయం విదితమే.