ఖమ్మం, జనవరి 14: ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సభా స్థలాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం వేకువజామునే పరిశీలించారు.
సభా స్థలంలో ఎటువైపు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించారు. వారి వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూధన్, ఎమ్మెల్సీ పాడి కౌషిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.