మామిళ్లగూడెం, జూన్ 7: బీసీ కుల, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం సంగారెడ్డి నుంచి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వీడియో సమావేశంలో పాల్గొనగా, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో సమావేశం నిర్వహించారు. బీసీ కుల, చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.