పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సత్తుపల్లి గ్రామపంచాయతీ.. నగర పంచాయతీగా పదోన్నతి పొందింది. ఆ తర్వాత మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. అయితే గతంలో ఉన్న ఇరుగు గదుల్లోనే అధికారులు, సిబ్బంది పాలనను నెట్టుకొచ్చారు. చాలీచాలని గదుల్లో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయి. వీటన్నింటినీ గుర్తించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య..
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు పరిస్థితిని వివరించి సత్తుపల్లి మున్సిపాలిటీ భవనానికి సుమారు రూ.3కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆ నిధులతో విశాలమైన భవనాన్ని నిర్మించి గత ఏడాది ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ హయాం లో ఆ భవ నంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తు న్నారు. గతంలో ఇరుకు గదుల్లో ఇబ్బందిపడిన సిబ్బంది, పట్టణ ప్రజలు ప్రస్తుతం విశాలమైన భవనంలో సేవలందు తుండ డంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-సత్తుపల్లి, జూలై 7